 
    
జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,47,000 పలికింది. పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులే అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో గమనించినట్లయితే బంగారం ధర ఒక ఔన్స్ భారీగా తగ్గింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా 4000 డాలర్ల కిందకు పడిపోయింది. ఇది ఒక దశలో 4396 డాలర్ల వరకూ వెళ్లింది. అక్కడి నుంచి ఏకంగా 400 డాలర్ల వరకూ పతనం అయ్యింది. ప్రస్తుతం ఒక ఔన్స్ (31.2 గ్రాముల) బంగారం ధర 3980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైానా అధ్యక్షుడు జి జిన్పింగ్ గురువారం సమావేశం కానున్నారు. అమెరికా చైనా నుంచి దిగుమతి అయ్యే సుంకాల విషయంలో పెంపు వాయిదా, అలాగే చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతుల్లో నియంత్రణల సడలింపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒప్పందం మార్కెట్కు పాజిటివ్ సంకేతం ఇచ్చింది. ఇదిలా ఉంటే పసిడి ధర ఈ ఏడాది ఆగస్టు నుండి 25% పెరిగాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ ఒక అంచనాలో భాగంగా 2026 చివరి నాటికి బంగారం ధర 3,500 డాలర్లకు ఒక ఔన్స్ చొప్పున తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సీఎన్బిసి బిజినెస్ వెబ్ పోర్టల్ ఒక వార్తా కథనంలో తెలిపింది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు వేస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర 1.40 లక్షల రూపాయలు పలుకుతోంది. ఒక దశలో రెండు లక్షల రూపాయల వరకు పలికినటువంటి ఒక కేజీ వెండి ధర ప్రస్తుతం భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గడంతో రిలీఫ్ లభించింది. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారు, ధర తక్కువగానే ఉన్నప్పుడు పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆశపడుతున్నారు