
ఆయన మరణం తెలంగాణ కలానికి తీరని లోటు
జనం న్యూస్ నవంబర్ 10(పెబ్బేరు )తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ గారి మరణం తెలంగాణ కు తీరని లోటు అని. పేర్కొన్నారు.ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని,తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయామని అన్నారు.“జయ జయహే తెలంగాణ” పాట ద్వారా తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసిన అందెశ్రీ గారి సేవలు మరువలేనివని, రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర అత్యంత కీలకమైంది అని అన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.