ఇంట్లోకి చొరబడి తండ్రి కళ్ళ ముందే దారుణం.. పాపం.

ఇంట్లోకి చొరబడి తండ్రి కళ్ళ ముందే దారుణం.. పాపం.

జనం న్యూస్: తాగిన మైకంలో ఓ వ్యక్తి చేసిన గొడవ అతడి ప్రాణాలు తీసింది. కొందరు వ్యక్తులు అతడి ఇంట్లోకి చొరబడి మరీ కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌లోని పరమహంస్‌ కాలనీకి చెందిన జైకుమార్‌ అనే వ్యక్తికి తాగుడు వ్యసనం ఉంది. రోజు తాగి ఇంటికి వచ్చే వాడు. తండ్రి వినోద్‌తో గొడవపడేవాడు. జైకుమార్‌ రెండు రోజుల క్రితం.. రాత్రి వేళ ఫుల్లుగా మందు తాగి ఇంటికి వచ్చాడు. తన తండ్రితో గొడవపెట్టుకున్నాడు. గొడవపడొద్దని తండ్రి ఎంతో చెప్పి చూశాడు. అయినా అతడు ఆపలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు స్థానిక యువకులు జైకుమార్‌ ఇంట్లోకి వచ్చారు. అతడితో గొడవపెట్టుకున్నారు. తర్వాత ఇంటి యజమాని పిల్లలను పిలిచారు. వీరంతా కలిసి జైకుమార్‌పై కర్రలతో దాడి చేయటం మొదలుపెట్టారు. అతడ్నే కాదు.. అడ్డుకున్న వినోద్‌పై కూడా దాడి చేశారు. ఇద్దరినీ విచక్షణా రహితంగా కొట్టారు. ఇద్దరూ కిందపడిపోగానే అక్కడినుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ జైకుమార్‌ అక్కడినుంచి వెళ్లి తన గదిలో నిద్రపోయాడు. స్వల్ప గాయాలపాలైన వినోద్‌ కూడా అక్కడే నిద్రపోయాడు. ఉదయం వినోద్‌ తన కుమారుడ్ని లేపటానికి వెళ్లగా అతడు లేవలేదు. వినోద్‌కు అనుమానం వచ్చింది. జైకుమార్‌ను పరీక్షించి చూడగా చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జైకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.