పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన....

పలు అభివృద్ధి  పనులకు శంకుస్థాపన....

జనం న్యూస్(మార్చ్ 20)(కేశంపేట మండలం) కేశంపేట మండల కేంద్రంలోని పలు కాలనీలలో తలపెట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు కేశంపేట సర్పంచ్ వెంకట్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేశంపేట గ్రామంలో ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్థానిక ఎంపీపీ రవీందర్ యాదవ్ సహకారం వల్ల ఎన్ ఆర్ ఈజీఎస్ నిధుల క్రింద 55 లక్షలు మంజూరుయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, ఎంపీపీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీడీవో చంద్రకుమార్ రెడ్డి గ్రామ కార్యదర్శి విద్యావతి దేవి వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు .