కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి

జనం న్యూస్ జనవరి 11 శాయంపేట మండలంలోని ఆరేపల్లి.గ్రామలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రెటరీ హీన ఉస్మాన్. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రెటరీ హీన ఉస్మాన్ సూచించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రెటరీ హీనా ఉస్మాన్ పాల్గొని కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు.ఆదిరెడ్డి భారత్ గ్యాస్ ప్రోప్రైటర్ దుంపల తిరుపతిరెడ్డి ,స్టేట్ బ్యాంక్ లీడ్ బ్యాంకు మేనేజర్ , బ్రాంచ్ మేనేజర్ చక్రధర్, పోస్ట్ ఆఫీస్ సూపరిండెంట్ హనుమంత్, సబ్ పోస్ట్ మాస్టర్ జీవన్రావు, ప్రభుత్వ వైద్యాధికారి సాయి కృష్ణ వెటర్నరీ డాక్టర్ సునీల్, అగ్రికల్చర్ ఏ ఈ ఓ అర్చన. తదితరులు పాల్గొన్నారు....