జగిత్యాల రొహింగ్య లకు అడ్డా

జగిత్యాల రొహింగ్య లకు అడ్డా

కాంగ్రెస్ జీవన్ రెడ్డి ముస్లింల పక్షపతి........


టోపీ పెట్టుడు హిందువులను తొక్కుడే ఆయన తీరు.......
-

40 ఏళ్లలో జగిత్యాలకు ఏం చేయాలే.......


ఫ్యాక్టరీలు పెడతాం గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పిస్తాం.......

 మైతాపూర్ కార్నర్ మీటింగ్ తాజా మాజీ ఎంపీ అరవింద......సంచలన వ్యాఖ్యలు......

 జనం న్యూస్ రాయికల్ ఏప్రిల్ 29


రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయగా మాజీ తాజా ఎంపీ అరవింద్ హాజరయ్యారు 
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మాట్లాడుతు జగిత్యాల కు ఏం చేయలేదు జీవన్ రెడ్డి అని తన రాజకీయ సుదీర్ఘ కాలంలో నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని  ప్రధానంగా అగ్నిమాపక కేంద్రం, డిగ్రీ కళాశాల, బస్టాండ్ వంటి సమస్యలు పరిష్కరించలేకపోయారని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే 
ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు 
 జగిత్యాల రోహింగ్యలకు అడ్డ 
జగిత్యాల జిల్లా కేంద్రాన్ని రోహిన్యాలకి అడ్డాగా చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లింలకు వంత పాడుతున్నాడని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన యూనిపామ్ సివిల్ కోడ్, తదితర బిల్లులకు మద్దతు పలక లేదని జగిత్యాల జిల్లా కేంద్రాన్ని పి ఎప్ ఐ లాంటి నిషేధిత సంస్థలకు అడ్డా కావడానికి ఇలాంటి నాయకులే కారణమని ఆయన హెద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన జీవిత కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు , ఎన్నికలు ఉన్నంతకాలం హిందువులకు దగ్గరగా ఉన్నట్లు  , నటిస్తూ ఎన్నికలు కాగానే రోహింగ్యాలకు ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతాడని హిందువులకు దేశ సభ్యత్వం అవసరం లేదు కానీ ముస్లింలకు అవసరం ఉందని ఆయన వాక్యాలు హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాడని అన్నారు 
జగిత్యాల జిల్లాలో మేము భోగ శ్రావణి ని నాయకురాలును చేశామని 70 సంవత్సరాల పైగా ఉన్న నేను నిలబడాలి రాజకీయం చేయాలనే విధానంతో కనీసం కుటుంబ సభ్యులను కూడా120 లేకపోవడం ఆయన నిరంతనియంతృత్వ పోకడలకు నిదర్శనమని అన్నారు
మోడీ ప్రభుత్వం ఉచితంగా పేద ప్రజలందరికీ బియ్యాన్ని ఇస్తుందని మహిళలకు సబ్సిడీ రుణాల ద్వారా అభివృద్ధి చెందే సౌలభ్యన్ని కల్పించడం జరిగింది అని లక్షలాది మంది నిరుపేదలకు ఇల్లు కట్టించామని గత బిఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వాలు మోడీ గృహ నిర్మాణలకు ఆమోదం తెలిపాక పోవడం సరికాదని అన్నారు 
 ప్యాక్టరీలు పెడతాం గల్ఫ్ వలసలు నివారిస్తాం 
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని రైతులను అనగా తొక్కిందని ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు పంట ధర అత్యధిక స్థాయికి తీసుకొచ్చామని వ్యవసాయ సంబంధిత ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని పసుపు, సుగంధ ద్రవ్యాలు, చెరుకు, బియ్యం, తదితర ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్పవలసలను నివారిస్తామని, చక్కర ఫ్యాక్టరీలు త్వరలోనే తెలుస్తామని కమిటీలు వేసి చెప్పే ఈ పెద్ద మనిషి వాటి విలువ లెక్క ఒకటి నిబద్ధతతో పారదర్శకతతో తెలిపితే 120 రోజుల్లో చెక్కర పరిశ్రమలను ప్రారంభిస్తామని ఈ సవాలు స్వీకరించి మాకు అప్పగించాలని  అన్నారు
 రేవంత్ రెడ్డి బీజీపీ లోకి వస్తాడట? 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలోకి తొంగి చూస్తున్నారని 
ఆయన చేరే అవకాశం ఉందని అలా పార్టీ వాల్లె అంటున్నారని ఎలాగో ఎంపీలు గెలిచే సత్తా పార్టీకి లేకపోవడం తో రిజల్టు రాగానే ఆయన చేరిక ఉంటుందని ఫలితాలు 
అంతర్గత కలహాలతో
ఆయనను వెళ్ల గొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని అన్నారు
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల తిరుపతి మండల అధ్యక్షులు అన్నవేణి వేణు,ఎంపీటీసీ రాజనాల మధు,పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.