విజయనగరంలో రోడ్డు ప్రమాదం
జనం న్యూస్, నవంబర్ 11
విజయనగరం
విజయనగరంలోని పూల్ బాగ్ కాలనీ సమీపంలో
విజయనగరం నుంచి నెల్లిమర్ల వైపు వెళ్తున్న బొలెరో
గురువారం రాత్రి ఆటోను ఢీకొనడంతో నలుగురు
వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఓ వ్యక్తి తలకు తీవ్ర
గాయాలు అవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడ్డ క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి
తరలించారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు
ఇంకా తెలియాల్సి ఉంది.