14 రోజు నా గోదా రంగనాయకీల కళ్యాణ మహోత్సవం*.

14  రోజు నా గోదా రంగనాయకీల కళ్యాణ మహోత్సవం*.

 జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండల పరిధిలోని శ్రీ శివ మార్కండేయ, వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో భోగి పండుగను పురస్కరించుకొని ఈ నెల 14న గోదా రంగనాయకిల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గోదా రంగనాయకిల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రులు కాగలరని చైర్మన్ సూర్యప్రకాష్ తెలిపారు.