2989మంది అంగన్వాడీల పై వేటు
జనం న్యూస్,జనవరి 23
విజయనగరం
విజయనగరం జిల్లా పరిధిలో డిసెంబర్ 12 నుంచి
నేటి వరకు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ సిబ్బందిని
తొలగిస్తూ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సోమవారం ఉత్తర్వులు
జారీ చేశారు. నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం వారితో
అనేకసార్లు చర్చలు జరిపిందని, వారి డిమాండ్లలో
చాలావరకు ఆమోదించిందన్నారు. జిల్లాలో 1658
మంది విధుల్లో చేరారని, ఇంకా సమ్మె చేస్తున్న
2989మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని
కలెక్టర్ తెలిపారు.