
జనం న్యూస్ :
Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. జియో ఈ ప్లాన్కు కార్పొరేట్ జియోఫై (JioFi) అని పేరు పెట్టింది. జియో ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫై డివైజ్ ఉచితంగా (Reliance Jio) పొందవచ్చు. కార్పొరేట్ కనెక్టివిటీ మార్కెట్లో జియో తన వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. అందుకే ఈ ప్లాన్తో యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే, జియోఫై డివైజ్ వాడిన తర్వాత తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని గమనించాలి. రూ. 299 నుంచి ప్రారంభమయ్యే జియో ఈ రీఛార్జ్ ప్లాన్లో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..కార్పొరేట్ జియోఫైలో రూటర్ M2S బ్లాక్ డివైజ్.. ఒక షార్ట్ వై-ఫై యూనిట్ ఉన్నాయని టెలికాం టాక్ రిపోర్టు చేసింది. 2300/1800/850MHz బ్యాండ్లలో 4G LTE సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ 10 Wi-Fi డివైజ్లను ఒక USB డివైజ్కు కనెక్ట్ చేయగలదు. 2300mAh బ్యాటరీ 5-6 గంటల ఇంటర్నెట్ వినియోగాన్ని అందిస్తుంది. ఈ డివైజ్ మైక్రో SD స్టోరేజీ, మైక్రో-USB ఛార్జింగ్ కలిగి ఉంది. 5G రౌటర్ కాకపోయినా చిన్న వ్యాపారాల కోసం పోర్టబుల్ 4G కనెక్షన్ అందిస్తుంది. జియోకాల్ యాప్, ఫైల్ షేరింగ్, వన్-టచ్ WPS సెటప్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది.
కార్పొరేట్ జియోఫై ప్లాన్లు :
రూ. 299 నెల ప్లాన్ 35GB డేటా : రోజుకు 100 SMS, 24 నెలల లాక్-ఇన్
రూ. 349 నెల ప్లాన్ 50GB డేటా : రోజుకు 100 SMS, 18 నెలల లాక్-ఇన్ వ్యవధి
రూ. 399 నెల ప్లాన్ 65GB డేటా : రోజుకు 100 SMS, 18 నెలల లాక్-ఇన్


 
	 
						 
						