జనం న్యూస్ :మనకు నిత్యం ఇంటిదగ్గర పిల్లులు అనేకం కనబడుతూ ఉంటాయి. వాటిలో తెల్లవి, నల్ల పిల్లులు అనేకం ఉంటాయి. కానీ, అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండే పునుగుపిల్లి చాలా అరుదైనది. దీని నుంచి వచ్చే తైలం స్వయంగా శ్రీవారి సన్నిధిలో తైలాభిషేకానికి వాడుతుంటారని అంటారు. అలాంటి పునుగుపిల్లి సాధారణంగా తిరుమల పరిసర ప్రాంతాలలోని నల్లమల అటవీ ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది. అయితే, ఇప్పుడు అది కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కనిపించింది.తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం తైలాభిషేకానికి ఉపయోగించే తైలం పునుగుపిల్లి తైలం. ఈ పునుగుపిల్లి తైలానికి తిరుమలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే టీటీడీ కూడా పునుగు పిల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అయితే, అనూహ్యంగా పులివెందులలో పునుగుపిల్లి దర్శనమిచ్చింది. పునుగుపిల్లి ఎర్రచందనం చెట్టుకు తన శరీరాన్ని రుద్దడం ద్వారా వచ్చే తైలం చాలా ప్రసిద్దమైనది.

