
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
నష్టపోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ
గేదెల మృతి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశం
ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ (అక్టోంబ్బర్ 25 పెబ్బేరు:గోపాల్పేట మండలం జైన్ తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్ తో పూసల చెరువులో రైతులు మద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డిలకు చెందిన 8పాడి గేదెలు మృతి చెందాయి.ఈ క్రమంలో శనివారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు తిరుమలాపురం గ్రామంలోని పాడి గేదెల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. పాడి గేదెల మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు కరెంట్ షాక్ తో గేదెలు మృత్యువాత పడుతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరి వహించిన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఎనిమిది గేదెలు మృతి చెందడంతో వాటి పిల్లలకు తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్నాయని దయచేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారిని కోరారు.ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారుతక్షణ సహాయంగా మద్దుల కొల్ల మల్లయ్య కు రూ.18000, భాస్కర్ రెడ్డి కి రూ.6000 నగదును అందజేశారు .ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు.గ్రామంలో మురికి కాలువలు లేవని విద్యుత్ స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు.ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి వెంటనే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఉమ్మడి గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలారెడ్డి, కొంకి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


 
	 
						 
						