అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా

అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా

జనం న్యూస్ జనవరి 23. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం లోని ఆజంనగర్ గ్రామంలో సీతారాముల కల్యాణ వైభోగం అంగరంగ వైభవంగా జరిగింది.. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని శ్రీశ్రీశ్రీ శివకేశవ జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వంగల నరహరి శర్మ సర్పంచ్ గోవిందుల రాజమ్మ ఎంపిటిసి జంగా సునీత.. మాజీ సర్పంచ్ బర్లగట్టయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అన్నదానం కూడా నిర్వహించారు శ్రమదాతలుగా కొత్తూరు రాజేందర్ గూడెపు శంకర్ కుందారపు శ్రీను వంగ రవీందర్ పాల్గొన్నారు...