హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్

హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్

జనం న్యూస్ కౌటాల,ఏప్రిల్ 07

మండలంలోని బాలేపల్లి గ్రామానికి చెందిన కోబ్రాగడే దీప్ చంద్ అనే వ్యక్తిపై గత నెల 27 న అదే గ్రామానికి చెందిన జాడి బాలు, జాడి ప్రియాంకలు గొడ్డలితో దీప్ చంద్ మెడ పై దాడి చేసి గాయపరిచారు. గతంలో ప్రియాంకకు దీపిచంద్ కు అక్రమ సంబంధం ఉన్నదని పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఇది దృష్టిలో పెట్టుకొని తమ వైవాహిక జీవితానికి దీప్ చంద్ అడ్డుగా వస్తున్నాడని గ్రహించి మార్చ్ 27వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో తన పంట చేను నుండి ఇంటికి వస్తున్న దీపిచంద్ పై జాడి బాలు, ప్రియాంకలు గొడ్డలితో నాలుగుసార్లు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి చెల్లె అయినా జాడి కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ మధుకర్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, అంతేకానీ ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు.