ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన ఆర్టీసీ బోర్డు సభ్యుడు రాజారెడ్డి

ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన ఆర్టీసీ బోర్డు సభ్యుడు రాజారెడ్డి

జనం న్యూస్, నవంబర్ 08

విజయనగరం

సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద

 ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. బోర్డు సభ్యులు . ఏ. రాజారెడ్డి , విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించినారు. ఈ సందర్శనలో భాగముగా కార్గో కౌంటర్ ను సందర్శించి వినియోగదారులను, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్గో ఆదాయమును పెంచి విధంగా సంస్థ అభివృద్ధికి భాగస్తులు కావాలని కోరారు. తదుపరి డిపో బస్సు స్టేషన్ ఆవరణలో సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడరు. సంస్థ అభివృద్ధిలో భాగస్థులు కాగలరని కోరారు. ఆ తరువాత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు, సూపెర్వైజర్లతో సమావేశం ఏర్పాటుచేసి కార్గో ఆదాయమును పెంచుటకు సూచనలు సలహాలు అడిగి తీసుకొన్నారు. ఈ కార్యక్రమములో విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి . సి. హెచ్. అప్పలనారాయణ , విజయనగరం జోన్ కమర్షియల్ అధికారి అప్పలనాయుడు ,పార్వతీపురం జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్ ,కమర్షియల్ ఎటిఎం హెచ్. దివ్య , విజయనగరం జిల్లా డిపో మేనేజర్లు, పార్వతీపురం జిల్లా డిపో మేనేజర్లు, సూపెర్వైజర్లు పాల్గొన్నారు.