గుంతకల్లు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం......సంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

గుంతకల్లు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం......సంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

జనం న్యూస్ మార్చి 29 జిల్లా ఇన్చార్జ్..తెదేపా- జనసేన-భాజపా కూటమి గుంతకల్లు నియోజకవర్గ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా గుంతకల్లు స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. తొలుత మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో తెదేపా ఇన్ఛార్జిగా జితేంద్ర గౌడ్ ఉన్న తనకే టికెట్ కేటాయించాలని పార్టీ అదిష్టానాన్ని కోరారు.మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కి టికెట్ దక్కింది.