గడపగడపకు అయోధ్య రామయ్య అక్షంతల పంపిణీ :

గడపగడపకు అయోధ్య రామయ్య అక్షంతల పంపిణీ :

జనం న్యూస్ కోరుట్ల జనవరి 14 గిన్నెల శ్రీకాంత్ నియోజకవర్గం ఇంచార్జ్ 

అయోధ్య రామయ్య అక్షంతలను శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 16వ వార్డులో ఇంటింటా పంపిణీ చేశారు. పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మహాదేశ్వర స్వామి దేవాలయంలో అక్షంతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న అనంతరం 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి మాట్లాడుతూ రామజన్మభూమి అయినా అయోధ్యలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఈనెల 22 న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఉందన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 22 రోజున ప్రతి ఒక్కరూ వారి వారి ఇండ్లలో పూజలు నిర్వహించి ఐదు దీపాలను వెలిగించాలని, అందులో నుండి రెండు దేవతల వద్ద, రెండు ఇంటి ముఖ ద్వారం వద్ద ,మరొకటి తులసమ్మ వద్ద వెలిగించాలన్నారు. ఈ అక్షంతలతో ఇంట్లో పెద్దలు కుటుంబ సభ్యులను దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాదేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గెల్ల గంగాధర్, కట్కూరి లక్ష్మీనారాయణ, చిరు మల్ల ధనుంజయ్, గట్ల శివకుమార్, గంగుల రాజకుమార్ రొండి రవికుమార్, జాల వినోద్ ,దామ శ్రావణ్, తిపిరి వంశీ, మేకల మహేష్, పసుల విక్రమ్, బలిజ శివప్రసాద్, దామా సచిన్, చిరంజీవి, మహిళలు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.