చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.

జనం న్యూస్ 13జనవరి

కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ఫర్.

సిర్పూర్.(యు).గ్రామీణ ప్రాంత యువత యువత చదువుతో పాటు క్రీడల్లో రానించాలని సిర్పూర్ (యు )ఎస్సై రాజు, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కుడిమెత విశ్వనాధ్ అన్నారు. శుక్రవారం సిర్పూర్( యు )మండలం మండలంలోని నేట్నూర్( బి)గ్రామంలో శ్రీ ఆంజనేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా పోటీలను ఏర్పాటు చేయగా వారు ముఖ్య అతిధిగా పాల్గొని పూజలు నిర్వహించి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో యువత ముందుకు రావాలని క్రీడాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఇలాంటి క్రీడా పోటీల వల్ల క్రీడాకారుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని వారు అన్నారు. క్రీడలు సమరస్యంగా, స్నేహ భావంతో నిర్వహించాలని, క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆడే జ్యోతి రావ్, దేవరీ, ఎంపిటిసి మారుతీ, ఉపసర్పంచ్, కాంగ్రెస్ యువ నాయకులు ఆత్రం దత్త, షేక్ ఆరిఫ్, క్రీడాకారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.