జిల్లా విశ్రాంత టీఎస్ ఆర్టీసీ నూతన డైరీ ని ఆవిష్కరించిన అర్థ సుధాకర్ రెడ్డి

జిల్లా విశ్రాంత టీఎస్ ఆర్టీసీ నూతన డైరీ ని ఆవిష్కరించిన అర్థ సుధాకర్ రెడ్డి

జనం న్యూస్ డిసెంబర్/13 వికారాబాద్ జిల్లా విశ్రాంత టీఎస్ఆర్టీసి ఉద్యోగుల సంఘం

నూతన డైరీ ని ఆవిష్కరించిన గౌరవ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి 

ఈరోజు వికారాబాద్ జిల్లా టిఎస్ఆర్టిసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున జిల్లా టీఎస్ ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024 సంవత్సర నూతన డైరీ నీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డికి సంఘం పెద్దలు పూలమాల లు,శాలువాతో సన్మానించారు, ఈ సందర్భంగా జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు టీఎస్ఆర్టీసి సమావేశాలు సభలు నిర్వహించుకునేందుకు విలువగా స్థలము మరియు భవన నిర్మాణం కోసం సహకరించాలని వినతిపత్రం అందించడం జరిగింది.. ఈ సందర్భంగా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టిసి జిల్లా రిటైర్డ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఎమ్ . సాయన్న, సెక్రటరీ అబ్దుల్ జబ్బార్, ఎండీ. ఫాజిల్,బి ఆర్ రెడ్డి, సిద్ధిక్, మన్నన్, రహీం, అనీఫ్ మరియు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు