:టీ.వై.జె.ఎఫ్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జిల్లా అధ్యక్షులుగా చల్మెడ అనిల్ కుమార్

:టీ.వై.జె.ఎఫ్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జిల్లా అధ్యక్షులుగా చల్మెడ అనిల్ కుమార్

 జనం న్యూస్ 13-01-2024 సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం

టి.వై.జె.ఎఫ్ సంగారెడ్డి జిల్లా సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి పరిష్కర మార్గాన్ని అన్వేషిస్తానని టీ..వై.జె.ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన టీ.వై.జె.ఎఫ్ జిల్లా సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ రాష్ట్ర కోశాధికారి మఠం మమత ల ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తణుగుల జితేందర్ రావు గారి ఆదేశాల ప్రకారం టీ.వై.జె.ఎఫ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తానని అన్నారు. జిల్లాలో ఉన్న విలేకరుల సమస్యలపై ఆయా ప్రాంత ఎమ్మెల్యేలను,జిల్లా కలెక్టర్ ను త్వరలో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తానని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న టీ.వై.జె.ఎఫ్ సభ్యులను అందరినీ కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అన్నారు. తనకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ రావు సార్ గారికి,రాష్ట్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు స్థానిక విలేకరులు చల్మెడ అనిల్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. నూతన కమిటీలో జిల్లా ఉపాధ్యక్షులుగా రైకోడ్ శేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శిగా మడపతి రాజశేఖర్,ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి జాకీర్,కోశాధికారిగా చింత శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులుగా శేఖర్,జగత్ కృష్ణ,సంగమేశ్వర్,సంగీత, లింగం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు పటాన్చెరు మండల అధ్యక్షుడు హరీష్ రెడ్డి, స్వామి ,శేఖర్ ,వెంకటేశం, ప్రభు, సందీప్, పవన్ సింగ్ ,అనిల్ ,జానారెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.