డాక్టరేట్ అవార్డు గ్రహీత పేట భాస్కర్ ను సన్మానించిన జువ్వాడి కృష్ణ రావు

డాక్టరేట్ అవార్డు గ్రహీత పేట భాస్కర్ ను సన్మానించిన జువ్వాడి కృష్ణ రావు

ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక అయిన తెలంగాణ సామాజిక ఉద్యమనేత పేట భాస్కర్ ను అభినందిస్తు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు సన్మానించారు. 

   శనివారం కాంగ్రెస్ పార్టీ భీమునిదుబ్బ కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పేట భాస్కర్ బడుగు బలహీన నిరుపేదల పక్షాన ఉద్యమిస్తు అంచెలంచెలుగా ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని తెలంగాణ ఉద్యమంలో, కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధనలో క్రియశీలకంగా వ్యవరించారని రాజ్యాంగ రక్షణే లక్ష్యం గా ముందుకు వెళ్లుతున్న క్రమంలో గౌరవ డాక్టరేట్ అవార్డు భాస్కర్ కు రావడం శుభపరిణామం అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ప్రధాన కార్యదర్శి మ్యాకల నర్సయ్య, మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, సిపిఐ నేత చెన్న విశ్వనాథం,వక్త మహ్మద్ షేక్ నాయకులు ఎంబేరి సత్యనారాయణ, శంభోజి మధు తదితరులు పాల్గొన్నారు