ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి

ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి

జనం న్యూస్ 5 నవంబర్ ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ లో గురుకుల్ ఎదురుగా ప్రజా ఆశీర్వాద సభలో హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఘట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని ఎంపీగా ఉండి మన మేడ్చల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు,నాయకులు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.