'బ్రాహ్మణ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం'
జనం న్యూస్,జనవరి 10
విజయనగరంఐదు
బ్రాహ్మణ జాతి అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే
సాధ్యమవుతుందని టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ
కన్వీనర్ ఇ.రాకేష్ శర్మ తెలిపారు. మంగళవారం
విజయనగరం టిడిపి కార్యాలయంలో ఆయన
మాట్లాడారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బ్రాహ్మణ
కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు
నాయుడుదని అన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో
సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఒక్క
పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు.