విజయనగరంలో తప్పిన పెను ప్రమాదం
జనం న్యూస్, సెప్టెంబర్ 09
విజయనగరం
విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలో శుక్రవారం
అరబిందో కంపెనీకి ఉద్యోగులతో బస్సు వెళ్తుండగా
ఇంజిన్లో సాంకేతిక లోపంతో మంటలు వచ్చాయి.
ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎ.ఎం. రాజు
గమనించి బస్సును నిలుపుదల చేసి ఉద్యోగులని
దించేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, ఆటో
డ్రైవర్ల సహకారంతో మంటలను అదుపు చేశారు. పెను
ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.