వివేకానంద లో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు*

వివేకానంద లో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు*

జనం న్యూస్ : జనవరి: 11:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో గురువారం సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయునీలు, విద్యార్థిని లు ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజెప్పడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయినీలు రత్నమాల, వాణిశ్రీ, జెరీనా, శిరీష, శివాణి, అరుణ, కవిత, భారతి, మానుష, తదితరులు పాల్గొన్నారు.