సీతారామ కళ్యాణమండపం నిర్మాణానికి లక్ష పదకొండు వేలు విరాళం

సీతారామ కళ్యాణమండపం నిర్మాణానికి లక్ష పదకొండు వేలు విరాళం

జనం న్యూస్ ఏప్రిల్ 09 నడిగూడెం


  మండల కేంద్రం  లోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి అనుబంధంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ కళ్యాణ మండప నిర్మాణానికి వరంగల్  పట్టణానికి చెందిన చెందిన జల్లా నాగేశ్వరరావు ,మనిమాల దంపతులు మంగళవారం ఒక లక్ష 11 వేల 116 రూపాయలు విరాళం గా అందజేశారు. వారి తల్లిదండ్రులు, కుమారుడు కీర్తిశేషులు జల్లా కేశవయ్య ,చూడమ్మా ,దినేష్ ల జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. గతంలో శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి నాగేశ్వరరావు దంపతులు  రూ. పది లక్షలు విరాళం గా అందజేశారు. దేవాలయానికి ,కళ్యాణ మండప నిర్మాణానికి దాతృత్వం చాటుకున్న నాగేశ్వరరావు దంపతులను దేవాలయ కమిటీ నిర్వాహకులు బి వెంకట రత్నం, చెన్నూరి బాబు ,కె వి ఎస్ ఎన్ గుప్తా, గజ్జి అప్పారావు ,బి. మహేష్, వి .దయాకర్ లు ప్రత్యేకంగా అభినందించారు.