10 సెంట్ల స్థలం కోసం భర్తను చంపిన భార్య
జనం న్యూస్,జనవరి 15
విజయనగరంఐదు
10 సెంట్ల స్థలం కోసం భర్తను హత్యచేసిన ఘటన
కశింకోట మండలంలో చోటుచేసుకుంది. బయ్య వరానికి
చెందిన బరుకు గోవింద (43)కు నేషనల్ హైవే
పక్కన ఉన్న స్థలాన్ని విక్రయించమని అతని భార్య
శివలక్ష్మి ఒత్తిడి చేసేది. స్థలాన్ని అమ్మేది లేదని గోవింద
చెప్పడంతో శనివారం రాత్రి మద్యంలో పురుగుల మందు
కలిపి భర్తకు తాగించింది. గోవింద తల్లి ఫిర్యాదుతో
పోలీసులు దర్యాప్తుచేయగా, నేరం చేసిందని శివలక్ష్మి
అంగీకరించినట్లు CI తెలిపారు.