నకిలీ బంగారం ముఠా అరెస్ట్

Uncategorized

*తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్.రూ.7లక్షల నగదు స్వాధీనం.

*రాంగ్ కాల్ చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా.

*రాగి – జింక్ మిశ్రమంతో కూడిన అర కేజీ నకిలీ బంగారు ముక్కలను ఇచ్చి రూ.12లక్షలు నగదు కాజేసిన వైనం.

*గుంటూరుకే చెందిన మరొక జంటను మోసం చేయడానికి ప్రయత్నించే క్రమంలో ముఠాలోనీ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన అరండల్ పేట పోలీసులు.

జనం న్యూస్ : అక్టోబర్ 22 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). గుంటూరు జిల్లా ఎస్పీ “వకుల్ జిందాల్” ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ “అరవింద్” పర్యవేక్షణలో అరండల్ పేట సీఐ శ్రీ ఆరోగ్య రాజు, ఎస్సై సుబ్బారావు మరియు పోలీస్ సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టినారు. (21.10.2025) జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ డిఎస్పి కార్యాలయంలో నిందితులను అరెస్టు పించి, తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగు తుందని, మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని వెస్ట్ డిఎస్పీ వెల్లడించడం జరిగింది. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అరండల్ పేట సీఐ ఆరోగ్యరాజుని, ఎస్ఐ ఎం.సుబ్బారావుని, మరియు కానిస్టేబుళ్లు డేవిడ్, ఉమామహేశ్వరరావు లను వెస్ట్ డీఎస్పీ అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *