SFI , DYFI ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ....

SFI , DYFI ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ....

జనం న్యూస్: మార్చి 22 : భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన
జనం న్యూస్ 22 మార్చ్ 
విజయనగరం
భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా SFI , DYFI విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెం నందు గల SSSS డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ శిరీష గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలాజీ గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎస్ఎఫ్ఐ కి మాత్రమే చెల్లిందని , ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ విధంగా ఆరు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని కొనియాడారు. అదే సందర్భంలో రక్తదానం చేసిన రక్త దాతలకు అభినందనలు తెలిపారు. మన ద్వారా సాటివారి ప్రాణాన్ని కాపాడగలిగేది రక్తం మాత్రమేనని అటువంటి రక్తదానానికి విద్యార్థులుగా ముందుకు రావడం శుభ పరిణామం అని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము , సిహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ దేశం కోసం 23 ఏళ్ల చిన్న వయసులో ప్రాణాలను తృణప్రాయంగా  త్యాగం చేసిన వీరులు భగత్ సింగ్ , రాజ్ గురు , సుక్ దేవ్ లని అటువంటి మహాత్ముల దారిలో నడిచే SFI ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏ విద్యార్థికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయిన వారికి మొట్ట మొదట గుర్తొచ్చే సంఘం SFI అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. SFI అంటే పోరాటాలే కాదు సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటా మని తెలిపారు. అనంతరం కార్యక్రమం నిర్వహించిన SFI , DYFI నాయకులకు 4s డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నం నాయుడు గారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరీష్ గారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు, మీడియా మిత్రులకు , బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు J రవికుమార్, M హర్ష, M వెంకీ, సహాయ కార్యదర్శి p రమేష్ , నాయకులు రాజు , శివ ,సోమేష్ , DYFI నాయకులు సతీష్ , రోటరీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఉమా బాలాజీ గారు నారాయణమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.