అంబేద్కర్ మారథాన్ రన్ కార్యక్రమం

అంబేద్కర్ మారథాన్ రన్ కార్యక్రమం

జనం న్యూస్, పార్వతీపురం:బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహా శిల్పం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం మారథాన్ రన్ నిర్వహించారు.

సెంట్ పీటర్స్ కాన్వెంట్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సాగిన మారథాన్ రన్ లో పాల్గొన్న వారంతా జై భీమ్, బాబా సాహెబ్ అంబేద్కర్ కు జోహార్ అనే నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నడిచారు. కార్యక్రమం చివరిలో కలెక్టరేట్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని,ఆయన ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి గయాజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రాములప్పడు, డిఈఓ ఎన్ ప్రేమ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకుడు,ఎంఈవో 1 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, డిఎస్వో వెంకటేశ్వర రావు, రెడ్ క్రాస్ చైర్మన్ మంచి పల్లి శ్రీరాములు, ఎంఈవో లు, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.