హెరిటేజ్ పాడి రైతులకు సంక్రాంత్రి బోనస్ పంపిణీ

హెరిటేజ్ పాడి రైతులకు సంక్రాంత్రి బోనస్ పంపిణీ

అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని కొండకర్ల గ్రామంలో హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు 26 మంది పాడి రైతులకు సంక్రాంతి బోనస్ రూ.2 లక్షల15 వేల రూపాయలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ డైరీలో పాలు సరఫరా చేస్తున్న ప్రతి పాడి రైతుకు కృత్రిమ గర్భధారణ రాయితీ పై రూ.50 అదేవిధంగా కృత్రిమ గర్భధారణ (ఆడ దూడ పోట్టేటందుకు) రాయితీ పైన 500 రూపాయలు లకు చెయ్యబడునని

హెరిటేజ్ డైరీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని అలాగే హెరిటేజ్ డైరీలో సభ్యత్వం ఉన్న పాడిరైతు ప్రమాదంలో మరణించినట్లయితే 2 లక్షల రూపాయలు సహజ మరణానికి 50 వేల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి. జగ్గారావు,ప్రకాశరావు, కుమార్,కె శ్రీను,జీ. రమణాజీ,బి శివ,డి. ఆదినారాయణ,జీ.మంగ కె. వరహాలమ్మ తదితర రైతులు పాల్గొన్నారు.