అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 25 (జనం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మీదుగా కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్సై షాహినా చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు తెలుపుతూ అశోక్ లై లాండ్ వాహనాలలో సుమారు 25 క్విటాళ్ళ రేషన్ బియ్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా అదుపులోకి తీసుకోవటం జరిగిందని, వారిని విచారించి 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాలను, బియ్యాన్ని సీజ్ చేయటం జరిగిందన్నారు. నిబందనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట కానిస్టేబుల్స్ జీవన్, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు....