అబాకస్ మాథ్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

అబాకస్ మాథ్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

నడిగూడెం, ఏప్రిల్ 2,జనం న్యూస్:
మండల కేంద్రం లోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 
అబాకస్,వేదిక్ మాథ్స్ లో పాఠశాల కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు గోల్డ్ ,సిల్వర్ మెడల్స్ సాధించినట్లు, పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన సోమవారం తెలిపారు.గోల్డ్, మెడల్స్ రిషిత,ముకేష్,దీక్షిత, వృషిత్ లు,సిల్వర్ మెడల్స్ ను, మోక్షిత్ సాయి,పనేత్ర,శ్రీజ,ఇందు, లు  సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.కొంతమంది విద్యార్థులు ఎక్సలెన్స్ సర్టిఫికెట్స్ సాధించారని అన్నారు.మెడల్స్ సాధించిన విద్యార్థులకు  పాఠశాలలో మెడల్స్ పంపిణీ చేసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్దులకు గణితం పై అవగాహన,సులభం గా నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు వీరయ్య,హర్ష, మల్లిక లు ఉన్నారు.