‘ఆడపిల్లలకు చదువుతో పాటు భద్రత ముఖ్యం'
జనం న్యూస్,జనవరి 25 విజయనగరంఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగాఉండాలని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారి
కోసం తల్లి దండ్రులకు తెలియజేయాలని రాష్ట్ర బాలలహక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.చదువుతో పాటు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమనిపేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారంజాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోఅయన పాల్గొన్నారు.