ఏనాడూ కరీంనగర్‌ ప్రజల బాగోగులను పట్టించుకోని బండి సంజయ్‌: మంత్రి గంగుల

ఏనాడూ కరీంనగర్‌ ప్రజల బాగోగులను పట్టించుకోని బండి సంజయ్‌: మంత్రి గంగుల

v జనం న్యూస్ కరీంనగర్ నవంబర్ 21 ( వేణు కరీంనగర్ బ్యూరో) -     బండి సజయ్‌  ఏనాడూ కరీంనగర్‌, తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి, కులాల కుంపట్లు రాజేసి రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూడటం హేయమన్నారు. కరీంనగర్‌: ఎంపీ బండి సజయ్‌  ఏనాడూ కరీంనగర్‌, తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి, కులాల కుంపట్లు రాజేసి రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూడటం హేయమన్నారు. ఇలాం వ్యక్తులకు తెలంగాణ  రాజకీయాల్లో చోటులేదని చెప్పారు. కరీంనగర్‌లోని  అంబేద్కర్‌ స్టేడియంలో మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి గంగుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులను 2018 నాటికే పూర్తిచేశామని, అయినా 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్‌ తానే స్మార్ట్‌ సిటీ సాధించానని చెప్పుకోవడం ఆయన రాజకీయ అవివేకానికి, స్వార్ధానికి నిదర్శనమన్నారు.కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోకాలడ్డినా సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని చెప్పారు. నాడు ఎంపీగా ఉన్న వినోద్, తనను పిలిచి స్మార్ట్ సిటీ పనులను అప్పగించారని తెలిపారు. అప్పడు ఇదే కార్పోరేషన్‌లో కార్పోరేటర్‌గా ఉన్న బండి సంజయ్‌ని స్మార్ట్ సిటీ సాధన కోసం పోరాడుదామంటే రాకుండా పారిపోయారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు ఈ నెల 30న తమ అమూల్యమైన ఓటుతో తగిన సమాధానం చెప్పాలన్నారు.