కన్న ప్రేగును కబాలించిన కసాయి తల్లి తల్లి కి జీవిత ఖైదు విధించిన -జిల్లా &సెషన్స్ జడ్జి

జనం న్యూస్ సెప్టెంబర్ 13:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన గుండ అభిషేక్ కులం: పద్మశాలి ఇతను తొర్తి గ్రామానికి చెందిన అమ్మాయి నవ్య@ లావణ్య ను పెండ్లి చేసుకున్నాడు. ఉపాధి కొరకు దుబాయ్ వెళ్తూ వస్తుంటాడు. వీరికి 4సంవత్సరాలకుమారుడు ఉన్నాడు. భర్త లేనందున తల్లి గారి ఇంట్లోనే ఉండడం జరిగింది.గత మూడు సంవత్సరాలనుండి ఒక వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టు కొని కొడుకు అడ్డు వస్తున్నాడు అని పథకం వేసి తేది 12.11.2020రోజునా మధ్యాహ్నం మూడు గంటలకు కొడుకు గొంతు ను నులిమి హత్య చేసింది.అందుకు గాను బుధవారం రోజునా 13.09.2023 జిల్లా & సెషన్స్ జడ్జి నిజామాబాద్ కె . సునీత, నిందితురాలిని దోషిగా నిర్దారించి, జీవిత ఖైదు శిక్ష విధించబడింది మరియు రూ. 2,000/- జరిమానా విధించారు.  యావజ్జీవ కారాగార శిక్ష పడినందుకు గాను కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్  బి.ప్రవీణ్,  జె.మచేందర్ రెడ్డి, షాప్ ఏర్గట్ల పి.ఎస్. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమ్‌గల్ . ఎ. వెంకటేశర్లు, మరియు ఏ సి పి ఆర్మూర్ యం . జగదీష్ చందర్ లను నిజామాబాదు పోలీస్ కమీషనర్  అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు.