కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అసెంబ్లి ఎన్నికల నామినేషన్ ల పర్వం.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అసెంబ్లి ఎన్నికల నామినేషన్ ల పర్వం.

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు.

జనం  న్యూస్  కరీంనగర్ నవంబరు 8:---( కరీంనగర్ బ్యూరో రాచర్ల వేణు ))   కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బుధవారం నామినేషన్ దాఖాలు చేశారు. ఆయన      మండలంలోని సింగాపూర్ గ్రామంలోని తన ఇంటి నుండి బయలుదేరి వచ్చి సింగాపూర్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కెన్ క్యాంపులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, అనుచరులతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన అంనతం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హుజూరాబాద్ మార్పు కోసం ఎన్నికల బరిలో ఉన్నానని, రాష్ట్రంలో, హుజూరాబాద్లో అరాచకాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం నా వంతుగా కృషి చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని గట్టి సంకల్పంతోనే ఎన్నికల్లో పోటీలో ఉంటున్నాయని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అశీర్వదించి గెలించాలని కోరారు. మీ గుండెల్లో నిలిచేపోయే విధంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు.