కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి*:

 నవంబర్ 7 కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం పైలాన్ లోని 10 వార్డ్ కౌన్సిలర్ తిరుమల కొండ మోహన్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని నాగార్జునసాగర్ లో ప్రజలకు బీసీ కాలనీ, ఉచిత కరెంటు, సాగర్ డ్యాం కూడా నిర్మించామన్నారు. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్ణాట రంగారెడ్డి,తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,వైన్స్ ప్రసాద్,ఓర్సు నరసింహారావు,సుమన్,తిరుమల కొండ శీను, కృష్ణ,ఉంగరాల,శీను,రాజు, జంగయ్య,వేణు, శంకర్,రంగారెడ్డి,రామాంజనేయులు,తిరుపతి వెంకటేశ్వర్లు,శంకర్ నాయక్,వెంకటస్వామి, రమణక్క,తదితరులు పాల్గొన్నారు.