గళ్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
జనం న్యూస్,జనవరి 20
విజయనగరంఐదు
పాచిపెంట మండలం సంకెళ్ళ గుమ్ము వాటర్ ఫాల్స్ వద్ద
బుధవారం గళ్లంతైన బాలుడి మృత దేహం శుక్రవారం
లభ్యమైంది. రామభద్రపురం మండలానికి చెందిన కాదల
ప్రదీప్ బుధవారం గుమ్ము వాటర్ ఫాల్స్ వద్ద గల్లంతైన
విషయం తెలిసిందే. గజ ఈతగాళ్ల సహాయంతో
డెడ్ బాడీని వెతికారు. కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నామని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. బాలుడి
మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు
మున్నీరుగా విలపిస్తున్నారు.