కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల మానవహారం

కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల మానవహారం

జనం న్యూస్,జనవరి 20

విజయనగరంఐదు

అంగన్వాడీలు 39వ రోజు సమ్మెలో భాగంగా శుక్రవారం

కలెక్టరేట్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. కనీస

వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు

అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై నెలలో

వేతనాలు పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం ఎంత

పెంచుతారో చెప్పి జీవో చేయాలని కోరారు. మంత్రులు

సమస్యలన్నీ పరిష్కారం చేశామని ఒట్టి మాటలు

చెప్పడం సమంజసం కాదన్నారు.