గ్రామాల్లో కన్నులపండువగా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట*

గ్రామాల్లో కన్నులపండువగా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట*

*రామ జ్యోతి పేరుతో దీపాలంకరణ*

అచ్యుతాపురం(జనం న్యూస్):అయోధ్య రామ మందిర మహా కృతువు ముగిసింది. 500 ఏళ్ల దేశ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని మండలం లోని అన్ని గ్రామాలలో నగర సంకీర్తనలు, భజనలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జోరుగా నిర్వహించారు.

మండలం లోని అన్ని గ్రామాలతో పాటు పూడిమడకలో

అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టను ఒక పండుగలా ఘనంగా జరుపుకున్నారు.

శ్రీరామ జయ రామ, జయజయ రామ అని పాటలు పాడుకుంటూ ర్యాలీ నిర్వహించారు.జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి రామ జ్యోతి పేరుతో దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు రాజారావు,డాక్టర్ శంకర్,కాసుబాబు,వసంరావు,ఏరిపల్లి బాపు నాయుడు,సత్తిబాబు,అచ్యుతరావు బంగారి చిట్టి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.