బాల రాముని ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

బాల రాముని ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

జనం న్యూస్ ాట్రేనుకున జనవరి 23

కాట్రేనికోన శ్రీ కోదండరామాలయం నందు అయోధ్య బాల రాముని ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, ఆలయ అర్చకులు ఫణికాంత్ శాస్త్రిఆధ్వర్యంలో ప్రత్యేకత పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. శ్రీ సోమ సూర్యనారాయణ రాజు సేవా సమితి తరపున ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ద్వారా భక్తులు విక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీరాముని యొక్క అక్షంతలను అందరూ శిరస్సున ధరించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ శ్రీ సోమ సూర్యనారాయణ రాజు సేవ సమితి వారు పులిహార చక్ర పొంగలి పానకం ప్రసాదాన్ని అందజేసినారు. అదేవిధంగా మరియొక భక్తులు కీర్తిశేషులు గ్రంధి రామారావు గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు వచ్చిన భక్తులందరికీ పులిహార మరియు గోధుమ నూక ప్రసాదాన్ని వితరణ చేసిరి. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ జయరామ అంటూ రామ నామాన్ని చేసిరి.సాయంత్రం నాలుగు గంటల నుండి భజన కార్యక్రమాలు, ఆలయం వద్ద ఆరు గంటల నుండి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.