తెల్లవారుజాము నుండి విధులకు హాజరైన మున్సిపల్ కార్మికులు*

తెల్లవారుజాము నుండి విధులకు హాజరైన మున్సిపల్ కార్మికులు*

జనం న్యూస్. జనవరి. 11. విజయనగరం జిల్లా. రాజాం.

ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న కార్మికులు. జీతం 15 వేల రూపాయలు తోపాటు హెల్త్ అలవెన్స్ 6000 రూపాయలు ఒకేసారి చెల్లిస్తాం అనడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు. గత కొద్ది రోజులుగా వీరు చేస్తున్న సమ్మెతో రాజాం మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో ఎక్కడికి అక్కడ చెత్తాచెదారం పెరిగిపోవడంతో ఈరోజు విధులకు హాజరైన కార్మికులతో పెరిగిపోయిన చెత్తాచెదారంను శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రసాదరావు ఆధ్వర్యంలో శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ జల్లించడం జరిగినది. సచివాలయ శానిటరీ సెక్రటరీలు,సూపర్వైజర్లు తదితరులు పాల్గొనడం జరిగినది...