తోటపల్లి జలాశయంలో యువతి మృతదేహం
జనం న్యూస్,జనవరి 22
విజయనగరం
తోటపల్లి జలాశయంలో ఓ యువతి మృతదేహం
శనివారం కలకలం సృష్టించింది. కొమరాడ మండల
కేంద్రంలో గల వారణాసి పద్మజగా స్థానికులు,
పోలీసులు గుర్తించారు. పోలీసులు సదరు యువతి
మృతదేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది