పాఠకులకు అవసరమైన పుస్తకాలను గ్రంధాలయాలలో అందుబాటులో ఉంచాలి

పాఠకులకు అవసరమైన పుస్తకాలను గ్రంధాలయాలలో అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టర్ బొర్కాడే హేమంత్ సహదేవ రావు.

జనం న్యూస్ 12జనవరి

కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్ :జిల్లా కేంద్రంలో నూతనంగా చేపట్టిన జిల్లా గ్రంధాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలనీ, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమౌవుతున్న జిల్లా గ్రంధాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిని పూర్తి చేసే విదంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శాఖ గ్రంధాలయాలలో పాఠకులకు అవసరమైన పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.