ప్రచారంలో దూసుకుపోతున్న కమలం నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్

ప్రచారంలో దూసుకుపోతున్న కమలం నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్

జనం న్యూస్.నవంబర్6. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రెహమాన్) హత్నూర మండలంలోని రొయ్యపల్లి అక్వంఛ గూడ వడ్డేపల్లి ఎల్లమ్మ గూడా చింతల్ చెరువు నాగారం పలు గ్రామాలలో నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గడపగడపకు జోరుగా ప్రచారం కొనసాగించారు. వారు మాట్లాడుతూ సునీతా లక్ష్మారెడ్డి 15 సంవత్సరాలు మదన్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారని అన్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మళ్లీ నియోజకవర్గ ప్రజలను అబద్ధాలు చెబుతు మభ్యపెడుతున్నారని ప్రజలు గమనించాలని మోసపోవద్దని అన్నారు అలాగే నియోజవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన మీ బీసీ బిడ్డను ప్రజలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని తెలిపారు ఏ దేశంలోనే చెయ్యని విధంగా కేవలం మన భారత దేశంలోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా సమయంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా వైద్యం అందించారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మేము అధికారంలోకి రాగానే ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తామని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే ఏకెక పార్టీ బిజెపి అని ఇది కేవలం బిజెపి పార్టీ తోనే సాధ్యమని తెలిపారు అలాగేనర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీ బీసీ బిడ్డను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ హత్నూర మండల అధ్యక్షులు. నాగ ప్రభు గౌడ్. నీరుడి అశోక్ . ఎర్ర సతీష్. చంద్ర గౌడ్ . కోలని రవి. దండు సతీష్. మహంకాళి సుధాకర్. కాసాల నాగేష్ యాదవ్. వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు