నిర్లక్ష్యం వహించిన బీఎల్వోలపై చర్యలు
జనం న్యూస్, నవంబర్ 06
విజయనగరం
ప్రత్యేక సమ్మరీ రివిజను 2024కు సంబంధించిన
విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు
పత్రికల్లో ప్రతికూల వార్తలు వచ్చిన నేపథ్యంలో
దత్తిరాజేరు మండలం బలభద్ర రాజపురం, డెంకాడ
మండలం జొన్నాడ బీఎలీలపై క్రమశిక్షణ చర్యలు
తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి
వెల్లడించారు. ఈ విషయమై వారిపై ఒక
నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు
ఆదేశించామన్నారు.