ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం

జనం న్యూస్ 15 మార్చి 2024:

పార్టీ మారకపోతే అక్రమ కేసులు.. దాడులు.. బెదిరింపులు 

పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం.. హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు 
 

హరీష్ రావు కామెంట్స్

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయింది

పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది

అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది

వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎం వచ్చింది

ఆయన ఏమైనా బంధిపోటా

FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారు

అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి

బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్న ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారు

బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారు

ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు

మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారు

కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి...వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి

BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు

ఇప్పటికి మూడు కేసులు పెట్టారు

ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు

గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు...పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరు

ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం

ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం

మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారు

పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా