మహా పాద యాత్ర లో పాల్గొన్న నీలం మదు ముదిరాజ్

మహా పాద యాత్ర లో పాల్గొన్న నీలం మదు ముదిరాజ్

జనసంద్రమైన పటాన్చెరు పట్టణం,వేలాదిగా  హాజరైన సబ్బండ వర్గాలు.. 

 బరిలో నిలబడుతున్నాం.. కలిసి పోరాడధాం.. గెలిచి చూపిద్దాం...
 
 అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్న.. 
 
 త్వరలో నియోజకవర్గమంత పాదయాత్ర... 

 మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా  విజయం తథ్యం..

 జనం న్యూస్ ప్రతినిధి విజయ్ సెప్టెంబర్ 30 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం పటాన్ చేరు పట్టణ పరిధి ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో  నిర్వహించిన  మహాపాదయాత్రకు బహుజన సబండవర్గాల ప్రజలు వేల సంఖ్యలో  హాజరయ్యారు.  ముందుగా మైత్రి గ్రౌండ్ వద్దకు చేరుకున్న తన అభిమానులు, పాదయాత్రకు హాజరైన ప్రజలతో  ర్యాలీగా బయలుదేరి  అంబేద్కర్ విగ్రహనికి నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు.మహా పాదయాత్రకు హాజరైన జనసందోహం కోరిక మేరకు నీలం మధు ముదిరాజ్ ముందుండి పాదయాత్రలో పాల్గొన్నారు. మహా పాదయాత్ర కు హాజరైన ప్రజలనుద్దేశించి నీలం మధు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు పాటుపడుతూ, బీసీ ఉద్యమన్ని ముందుకు నడిపిస్తామన్నారు, బీసీ బిడ్డ చట్టసభల్లో గొంతు ఎత్తుతనే  సబ్బండ వర్గాల ప్రజలందరికీ సంపూర్ణన్యాయంజరుగుతుందన్నారు. తనను ఎమ్మెల్యే గా చూడాలనే సంకల్పంతో వేలాది సబ్బండ వర్గాల ప్రజలు తనకు మద్ధతుగా తరలి రావడం సంతోషకరముగా ఉన్నదని ఆయన అన్నారు.మహా పాదయాత్రను అడ్డుకోవాలని కొంతమంది నేతలు ఎన్ని కుట్రలు చేసినా, పోలీస్ బలంతో పాదయాత్రను అడ్డుకోవాలని చూసిన ఆ కుట్రలను ఛేదించుకొని తరలివచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం ఋణపడి ఉంటానుఅనిఅన్నారు.బహుజన నాయకుని ఎదుగుదల జీర్ణించుకోలేక కొందరు నేతలు మనల్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అయితే ఐక్యమత్యంతో చలి చీమల్ల ముందుకు కదలి ఆ కొండచిలువల పని పడదామని పిలుపునిచ్చారు.తన ఎదుగుదలనుజీర్ణించుకోలేకపోతున్న నాయకులకు పది మంది కుటుంబ సభ్యులు ఉంటే తనకు నియోజకవర్గ ప్రజలే కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. తన వెంట ఉన్న వేలాది మంది ఒక్కొక్కరు 100 ఓట్ల చొప్పున వేయించి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని నినాదించిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ,క్రైస్తవ,సబ్బండ వర్గాల సత్తా నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని, మన బలహీన వర్గాల బిడ్డలు చట్ట సభల్లో అడుగు పెడితేనే మన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన  అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కు శ్రీకారం చూడుతున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలో ప్రతి గడప తొక్కుతానని, ప్రతి ఒక్కరిని కలిసి మద్దతు కూడగట్టడంతో పాటు ప్రతి  సమస్యను తెలుసుకుంటానని స్పష్టం చేశారు.కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలు ఏకమై మనహక్కులను సాధించుకుందమని స్పష్టం చేశారు.జనమే తన బలంగా, బహుజనుల హక్కులే ఎజెండాగా, సబండవర్గాల సమస్యల పరిష్కారమే మేనిఫెస్టో గా ముందుకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని నీలం మదు ముదిరాజ్ ప్రకటించారు. మీ అందరూ వెంట ఉంటే మీ ఆదరాభిమానాలు ఉంటే పార్టీ గుర్తులతో పనిలేదని సబండవర్గాల ప్రతినిధిగా మీ ఇంట్లో ఒక్కడు, మీ కుటుంబ సభ్యుడైన  నీలం మధు ముదిరాజ్ ఒక గుర్తుగా ముందుకు వెళదామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తనకు దేవుళ్ళతో సమానమని, తనను మీ ఇంటి బిడ్డగా భావిస్తూ పెద్దమనసుతో తనను ఆశీర్వదించాలని కోరారు.తన మీద నమ్మకంతో  వేలాదిగా తరలి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు,ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కుల సంఘల నాయకులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు,శ్రేయోభిలాషులు, అభిమానులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు