యధావిధిగా మద్యం అమ్మకాలు..!

యధావిధిగా మద్యం అమ్మకాలు..!

జనం న్యూస్ జూన్ 13. గొలుగొండ మండలం. మండలంలో పప్పుశెట్టిపాలెం గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 20 రోజులు ముందు పప్పుశెట్టిపాలెం గ్రామంలో మద్యం అమ్ముతున్న వ్యక్తుల్ని ఎస్సై నారాయణరావు పోలీస్ స్టేషన్నికి పిలిపించి మద్యం బాటిల్స్ తో దొరికిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి మిగతా వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు వ్యక్తులు యధావిధిగా మద్యం అమ్ముతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా మద్యం అమ్ముతున్న వ్యక్తులపై పోలీసు వారు .ఎక్స్చేంజ్ వారు. స్పెషల్ ఇన్ఫర్మేషన్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.